అల్లూరి విగ్రహానికి నివాళులర్పించిన కేంద్రమంత్రి వి.మురళీధరన్.
విశాఖ లోకల్ న్యూస్:భీమిలి ప్రతినిధి
భీమిలి పద్మనాభ మండలంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు జన్మ స్థలం పద్మనాభం పాండ్రంగి గ్రామాన్ని సందర్శించి,అల్లూరి విగ్రహానికి నివాళులర్పించిన కేంద్రమంత్రి వి.మురళీధరన్.
మీడియాతో మాట్లాడుతూ అమృత్ కా ఆజాది కార్యక్రమం లో భాగంగా మహానీయులను గుర్తు చేసుకోంటు,దేశ ప్రజలకు వారు చేసిన సేవలను ప్రజలకు తెలియ పరచేటట్టు చేయాలని వారి స్పూర్తిని యువతకు ఆదర్శం కావాలని తెలియపరచారు. అనంతరం పద్మనాభంలో రెండవ విజయరామరాజు సమాధిని సందర్శించిన కేంద్రమంత్రి. ఆనందపురం మండలం గంభీరం లో ఉన్నా ఐఐఎం సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పరిశిలించారు.పనులు త్వరగా పూర్తి అవుతున్నాయని తెలుసుకున్నారు.ఆనంతరం పనులు పూర్తి అయిన తరువాత మళ్ళి వస్తానాని తెలిపారు.పక్కనే ఉన్న సమీర్ సంస్దను సందర్శించి న అక్కడ ఉన్న యంత్రాలను పరిశించి వాటి కోసం అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో ఎంఎల్సి మాధవ్,కేతినేని సురేంద్ర కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర జోన్ సోషల్ మీడియా కన్వీనర్ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్.తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.