భీమిలి ఎమ్మెల్యే గంటా ఆదేశాలతో చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం, ఆవరణకు మోక్షం
మధురవాడ : విశాఖ లోకల్ : జూన్ 08:
చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం, ఆవరణకు మోక్షం లభించింది. చిన్న పాటి వర్షానికి నీరు నిలిచిపోయి బురదమయం అయ్యి పోయేది. ఈ సమస్యపై విద్యాశాఖ మంత్రి పాఠశాలను సందర్శించి స్థానిక ఎమ్మెల్యే గంటాకు సూచించారు.గంటా శ్రీనివాస్ రావు ఆ సమస్యను ప్రత్యేకంగా తీసుకుని విద్యార్థుల తల్లి తండ్రుల కమిటీకి ఆదేశించారు. ఆదివారం టీడీపీ యువనేత గంటా రవితేజ సూచనలతో విద్యార్థుల తల్లి తండ్రుల కమిటీ చైర్మన్ అచ్చుత రావు, టీడీపీ సీనియర్ నేత జీవన్ పర్యవేక్షణలో కళాశాల క్రీడా మైదానం చదును చేసి గ్రావెల్ తో శుభ్రపరిచారు.