శ్రీ టెక్ సొల్యూషన్స్ 10వ వార్షికోత్సవ వేడుకలు.

శ్రీ టెక్ సొల్యూషన్స్ 10వ వార్షికోత్సవ వేడుకలు.         

మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి :జూన్ 20: 

ఐటీ రంగంలో అకుంఠితదీక్షతో పాటు ప్రణాళిక బద్ధంగా సాగితే అనుకున్న లక్ష్యాలను ఛేదించగలమని శ్రీ టెక్ సొల్యూషన్స్ సీఈవో తోట హరి అన్నారు. మధురవాడ మారికవలసలో  గల తమ కార్యాలయంలో సిబ్బందితో కలిసి 10వ వార్షిక వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ టెక్ సొల్యూషన్స్ సి ఈ ఓ తోట హరి మాట్లాడుతూ  ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వినియోగదారులు కావలసిన అన్ని అంశాల్లో తగు సూచనలు సలహాలు అందిస్తున్నామని. ఐటీ రంగంలో వస్తున్న విప్లమాత్మక మార్పులను అందిపుచ్చుకొని మరింత అభివృద్ధి దిశగా తమ కంపెనీ ఎదిగిందని, దశాబ్దా కాలం క్రితం ఐటి రంగంలో అడుగుపెట్టిన  శ్రీ టెక్ ఇప్పుడు విశాఖలోనే అగ్రగామిగా నిలిచిందని, క్లైంట్స్ కి కావలసిన విధంగా సాఫ్ట్వేర్ల రూపొందించడమే కాకుండా అన్ని అంశాల్లో వారికి అండగా నిలవడం వల్ల ఈ స్థాయికి చేరింది అన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 6 బ్రాంచ్ లు ఉన్నాయి తొలిసారి మధురవాడ మారికవలస ప్రాంతంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించాం అన్నారు. 10 సంవత్సరాల జర్ని సంతృప్తినిచ్చింది. 

5 గురితో ప్రారంభమైన సంస్థ ఇప్పుడు 1100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు.అందరు సహకారాలతో ఈ స్థాయికి చేరుకున్నాం. ఇది బిజినెస్ కాదు ఇది నా జీవితంలో ఒక మైలురాయి.అందరు హార్డ్ వర్క్ చేయటం వలన ఇ సక్సెస్ అoదరిది అన్నారు.ఇంకా  కోత్తగా కార్యాలయాలు ప్రారంభించనున్నాము. Ai ఇంకా కోత్త టెక్నాలజీ రావచ్చు. ఐటి అనేది అప్డెట్ గా ఉంటాయి మనస్పూర్తిగా గా వర్క్ చేస్తె ఎదైనా సక్సెస్ అవుతాది అనేది నా నమ్మకం.కృషి పట్టుదలతో పాటు హార్డ్ వర్క్ ఉంటే ఐటీ రంగాల్లో సాధించగలము అని అన్నారు.  ఈ కార్యక్రమంలో శ్రీ టెక్ మేనేజర్ వెంకట్, స్వప్న తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.