7వవార్డ్ సభ్యులతో యోగ ట్రయిల్ రన్ నిర్వహించిన రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిళ్ళా వెంకటరావు.
మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : జూన్ 20:
పోతినమ్మల్లయ్యపాలెం ఏసీఏ వీడిసిఏ అంతర్జాతీయ క్రికెట్ బి మైదానంలో 7,8 వార్డుల సభ్యులకు యోగాంద్ర మైదానంలో ఏర్పాట్లు పూర్తిచేసారు. ఆ మైదానంలో శుక్రవారం ఉదయం టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిళ్ళా వెంకటరావు ఆధ్వర్యంలో ట్రయిల్ రన్ నిర్వహించారు. బస్సు లో సభ్యులను తరలించటం మైదానంలో యోగ ట్రైల్స్ నిర్వహించారు. సభ్యులతో కలిసి రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిళ్ళా వెంకటరావు యోగా చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆహరం, తీరికలేని ఒత్తిడి వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. వాటిని మందులతో కాకుండా ప్రతీ రోజు కొంత సమయం యోగకి కేటాయించి యోగా చేయటం వలన కొంత మేర ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. 7వవార్డ్ కూటమి నేతలకు శనివారం జరగ బోయే అంతర్జాతీయ యోగ దినోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాలింగ కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి దుర్గారావు, 7వవార్డ్ జనసేన అధ్యక్షులు నాగోతి నరసింహ నాయుడు, సచివాలయం సిబ్బంది, ఆశా వర్కర్లు, ఎస్హెచ్జి మెంబర్లు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు