డిఈఓ కార్యాలయ ముట్టడించిన విశాఖ ఉపాధ్యాయులు
మధురవాడ : విశాఖ లోకల్ : జూన్ 08:
విశాఖపట్నం లోని ఉపాధ్యాయులు డిఈఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమం ఆదివారం ఉదయం నిర్వహించారు. డిఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలతో హోరేతించారు. అనంతరం డిఈఓ ప్రేమ్ కుమార్ కు వినతిపత్రం అందచేశారు.వెబ్ కౌన్సిలింగ్ రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఎండలో రోడ్డుపై ఎస్.జీ.టీ.లు బైటాయించారు. భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి మోసం చేసింది అని అన్నారు. వెబ్ కౌన్సిలింగ్ లేదని చెప్పి ఆఖరి నిముషంలో మాట తప్పింది అని అన్నారు. అధికారుల మాటలు నమ్మి ఇచ్చిన హామీ అమలు చేయకుండా మాయ చేసిన ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు అని హేచ్చరించారు. సీఎం, విద్యాశాఖ మంత్రి తక్షణం కల్పించుకోవాలి అని కోరారు.
సాధారణ బదిలీలు కూడా చెయ్యలేని ప్రభుత్వం ఇది అని విమర్శించారు.
ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటం ఉదృతం చేస్తాం అని సూచించారు.