రోడ్డుమీద మురుగు నీరు ప్రవహిస్తుండటంతో నడవలేక పోతున్నాం. సిపిఎం నేతలు
మధురవాడ: విశాఖ లోకల్ : జూన్ 08:
మధురవాడ మార్కెట్ వద్ద కాలువ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలనీ సిపిఎం నేతలు డిమాండ్ చేసారు. మార్కెట్ వద్ద కాలువ పొంగి, రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగు నీరు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం స్థానికులు ధర్నా నిర్వహించారు. ప్ల కార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డీఅప్పలరాజు మాట్లాడుతూ జీవీఎంసీ 7వవార్డు మధురవాడ మార్కెట్ వద్ద ఎంతో కాలం నుండి మురుగు కాలువ సమస్య ఉంది అని అన్నారు. కాలువ గట్టులు పూర్తిగా విరిగిపోయి శిథిలమైపోయింది అని తెలియ చేసారు. మరో వైపు ప్రధాన కాలువ వ్యర్థాలతో మట్టితో పూడిక పోయిందని అన్నారు. ఈ కారణంగా మురుగు నీరు కాలువ పొంగి రహదారిపై ప్రవహిస్తుందని అన్నారు. మురుగు నీటిలో నడవలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. పసిపిల్లలను తీసుకొచ్చే వాళ్ళు,వాహన దారులు తీవ్ర అవస్తలు పడుతున్నారని తెలిపారు. మార్కెట్ రహదారిలో ప్రయాణించే వారు, కొనుగోలు దారులు అశ్వస్తకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా చిల్లర వర్తకులు ఉపాధి కోల్పోయి అవస్తలు పడుతున్నారని అన్నారు. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇది చాలా అన్యాయమని విమర్శించారు. ఉన్నఫళంగా పూడికలు వెంటనే తీయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సిదిలమైపోయిన కాలువ పూర్తిగా నిర్మాణం చేయాలని కోరారు. అదేవిధంగా మధురవాడ వంతెన క్రింద, రేవళ్ళు పాలెం మాస్టర్ ప్లాన్ రహదారిలో వర్షం వస్తే చెరువులుగా మారి ప్రయాణాలు నరకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పీ రాజు కుమార్, డీ కొండమ్మా, టీ కే శారద,డీ రవి, డీ అప్పలరాజు, ఐ ఈశ్వరరావు, వై వెంకటలక్ష్మి, లక్ష్మి, ఉమశైలు తదితరులు పాల్గొన్నారు.