ప్రస్తుతం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది : కోరాడ రాజబాబు

 ప్రస్తుతం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం  నడుస్తుంది : కోరాడ రాజబాబు 

  విశాఖ లోకల్ న్యూస్ భీమిలి ప్రతినిధి: ఒకటో వార్డు తగరపువలస అంబేద్కర్ కూడలి అన్న క్యాంటీన్ దగ్గర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  కుప్పం పర్యటనలో భాగంగా అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసిపి  రౌడీలు అత్యంత దారుణంగా అన్న కాంటీన్ ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చింపి రాళ్లు దాడి చేయడాన్ని ఖండిస్తూ గురువారం తగరపువలస అన్న క్యాంటీన్ దగ్గర నిరసన తెలియజేసి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీగా వెళ్లి రోడ్డు దిగ్బంధం చేసి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ప్రస్తుతం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తున్నారని రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా రౌడీయిజం ఫ్యాక్షనిజం తప్ప అందరికీ సమాన హక్కులు ఉండే అంబేద్కర్ రాజ్యాంగం లేదని అందుకే రాజ్యాంగాన్ని పరిరక్షించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, భీమిలి రూరల్ పార్టీ అధ్యక్షులు డిఏఎన్ రాజు ,, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి,, రెండో వార్డ్ కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి ,, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పిట్టా సురేష్ ,రాష్ట్ర పద్మశాలి కమిటీ సభ్యులు  వానపల్లి సత్య, పద్మనాభం మండల పార్టీ ప్రెసిడెంట్ కోరాడ రమణ ,రెండు వార్డ్ అధ్యక్షులు బడిగంట నీలకంఠం, నాలుగవ వార్డ్ అధ్యక్షులు పాసి నర్సింగ్ రావు ,ఐదో వార్డ మొల్లి. లక్ష్మణరావు, వాండ్రసి. అప్పలరాజు ,సీనియర్ నాయకులు బోయి వెంకటరమణ రెడ్డి సత్యనారాయణ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి, విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ గన్రెడ్డి రమేష్ విశాఖపట్నం ఎస్సీ సెల్ కార్యదర్శి సబ్బవరపు శ్రీను నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు తాట్రాజు అప్పారావు ఉపాధ్యక్షులు ఎరబాల అనిల్ ప్రసాద్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను సోడిపల్లి జయశంకర్ సాయి నియోజకవర్గ రైతు విభాగ ఉపాధ్యక్షులు కనకాల సూరిబాబు చిలక నర్సింగరావు భీమిలి మండల తెలుగు యువత అధ్యక్షులు కంటుబొగత సత్తిబాబు నియోజకవర్గ తెలుగు మహిళ ఆర్గనైజింగ్ సెక్రటరీ మోటూరి కనక రత్నం గరికిన ఎల్లయ్య (కింగ్ )ఎస్ గణేష్ రెడ్డి గరే సదా పెంటపల్లి యోగేశ్వరరావు మారోజు సంజీవ్ కుమార్ కనకల అప్పలనాయుడు కాసరపు ఎల్లాజీ తదితర నియోజకవర్గ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది