కుప్పం లో వైఎస్ఆర్ నాయకులు అన్న క్యాంటీన్ ధ్వంసం చేసినందుకు ,చంద్ర బాబు ని అడ్డుకున్నందుకు టీడీపీ నాయకులు నిరసన.
ప్రజా వ్యతిరేఖ కార్యక్రమాలు చేస్తున్న జగన్ను మొన్న చెల్లి ,నిన్న తల్లి వదిలేయగా రేపు ప్రజలు కూడా వదిలేస్తారుఅని టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి హెచ్చరించారు.
కుప్పం లో వైఎస్ఆర్ నాయకులు అన్న క్యాంటీన్ ధ్వంసం చేసినందుకు ,చంద్ర బాబు ని అడ్డుకున్నందుకు నిరసనగా జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మరియు తెలుగుదేశం కార్పొరేటర్లు , దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ గండి బాబ్జి మరియు భీమిలి నియోజకవర్గం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మరియు 2వార్డ్ కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మీ దక్షిణ నియోజవర్గ నాయకులు జీవిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేశారు.
పీలా శ్రీనివాసరావు గాడు చిన్ని కుమారి లక్ష్మి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి వ్యతిరేకమని కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి పేదవారి కడుపు కొట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలే అతి త్వరలో గద్ది దించుతారని తెలిపారు. పేద ప్రజల నోటి దగ్గర అన్నం లేకుండా చేస్తున్న జగన్ను త్వరలో ముఖ్యమంత్రి పదవి నుండి దూరం చెయ్యడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
చంద్రబాబు నాయుడు ప్రజల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తుంటే, ఓర్వలేక జగన్ అన్నక్యాంటీన్ ను ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. మంచి పనులు చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారిని అడ్డుకోవడాన్ని కార్పొరేటర్లు అందరం ఖండిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు,పల్లా శ్రీనివాసరావు, గొలగాని వీరారావు,దాడి వెంకట రమేశ్, మొల్లి హేమలత, పిల్ల మంగమ్మ, ముక్కా శ్రావణి, నొల్లి నూక రత్నం, రౌతు శ్రీనివాస్ ,గంటా అప్పలకొండ ,మరియు తెలుగుదేశం దక్షిణ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.