ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలి,పూర్తిగా విడనాడాలి.!జీవీఎంసీ జోన్-2కమిషనర్ బొడ్డేపల్లి రాము సూచించారు.
మధురవాడ:ఆగస్టు 25:విశాఖ లోకల్ న్యూస్
విద్యాసంస్థలు ప్లాస్టిక్ నిర్మూలనకు ముఖ్య భూమిక పోషించాలి.
ఎన్.ఐ.ఎఫ్.ఎస్ విద్యాసంస్థల అధినేత సునీల్ మహంతి.
మధురవాడ: జీవీఎంసీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని,ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ విడనాడి సహకరించాలని జీవీఎంసీ జోన్-2 కమిషనర్ బొడ్డేపల్లి రాము కోరారు. జివిఎంసి 6వ వార్డు పరిధి మధురవాడ కార్ షెడ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దగ్గరలో గల మాలతాంబ విద్యానికేతన్ లో గురువారం అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నిషేధంవలన సత్ఫలితాలు వస్తున్నాయని,ఇప్పటికే ప్రజలు,వ్యాపారులు ప్రత్యామ్నాయాలపై పూర్తి దృష్టి సారించారని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్.ఐ.ఎఫ్.ఎస్ విద్యాసంస్థల అధినేత సునీల్ మహంతి మాట్లాడుతూ.. విద్యాసంస్థలు ప్లాస్టిక్ నిర్మూలనకు ముఖ్య భూమిక పోషించాలని సూచించారు.
పాలిథీన్ నిషేధాన్ని సహకరించండిఅని,ప్లాస్టిక్ కు బదులుగా కాగితం,వస్త్ర, జూట్ సంచులను..అరటి ఆకులు,విస్తరాకులు,స్టీల్ ప్లేట్లు,స్పూన్లు,తదితరమైనవి వాడాలని,స్పష్టం చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు పరిశుభ్రతకు,ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలని ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో 6వ వార్డు అధ్యక్షులు బొట్టఅప్పలరాజు, మాలతాంబ విద్యానికేతన్ ప్రిన్సిపాల్ పి.ఎం.రాజు,వైస్ ప్రిన్సిపాల్ ఎన్.గాయత్రి దేవి, సీ.వోలు.విజయలక్ష్మి,ఉమా, సచివాలయ సెక్రటరీలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.