సచివాలయం లో రెవిన్యూ సేవల పట్ల కలెక్టర్ అసంతృప్తి.
పాడేరు:ఆగస్ట్ 25
మూడు నెలలుగా ఒక్క మ్యుటేషన్ జరగని సచివాలయం విఆర్ఒకు షోకాజ్ నోటీసు
పాడేరు,:- దుంబ్రిగుడ మండలం కొర్ర సచివాలయంలో అందిస్తున్న రెవిన్యూ సేవలు సరిగా అందించటం లేదని కలెక్టర్ సుమిత్ కుమార్ అసంతృప్తి వ్యక్త పరిచారు. సచివాలయం నుండి గత మూడు నెలలుగా ఒక్క మ్యుటేషన్ కుడా నిర్వహించకపోవటం పట్ల అసహనం వ్యక్తపరిచిన కలెక్టర్ సంబంధిత విఆర్ఒ కు షోకాజ్ నోటీసు జారీ చేసారు. గురువారం కలెక్టర్ దుంబ్రిగుడ మండలంలోని కొర్ర సచివాలయాన్ని ఆక్ష్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ మరో రెండు నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసి అద్దె భవనం నుండి సచివాలయంకు తరలించాలని కాంట్రాక్టర్ ను, సిబ్బందిని ఆదేశించారు. సచివాలయ పరిధిలో అనేక మందికి రేషన్ కార్డులు లేకపోవటాన్ని తెలుసుకున్న కలెక్టర్ అందుకు మ్యుటేషన్లు జరగపోవటమే కారణమని గుర్తించారు. ఈ నేపధ్యంలో విఆర్ఒకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేసారు. సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా కార్యాలయ సమయంలో కార్యాలయంలోనే ఉండాలని, కార్యాలయ పని మీద బయటకు వెళ్తే తప్పనిసరిగా మూవ్మెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు.
సచివాలయంలోని మహిళా పోలీసులు అంగన్వాడి కేంద్రాలను తరచూ సందర్శించి పిల్లల పెరుగుదలను సంబంధిత యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. పంచాయతి కార్యదర్శి తరచూ పాటశాలలు, అంగన్వాడి కేంద్రాలు సందర్శించి నివేదికలు సమర్పించాలన్నారు. అదేవిధంగా నాడు-నేడు కింద చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా పర్యవేక్షిoచాలన్నారు.
ఈ పర్యటనలో దుంబ్రిగుడ సర్పంచ్, ఇఒఆర్డి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.