మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
విద్యార్థులకు అండగా!.ఎన్.ఐ.ఎఫ్.ఎస్. విద్యాసంస్థల అధినేత సునీల్ మహంతి.
నేటి యువత విద్యా,క్రీడలు వంటి వాటిలో తమ నైపుణ్యత చాటి జీవితంలో ఉన్నతశిఖరాలను అధిరోహించాలని ఎందరో విద్యార్ధులు కలలుకంటూ ఉంటారు. అయితే వాటిని సాకారం చేసుకునే విషయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారి ఆశయాల సాధనలో విఫలం అవుతుంటారు.అయితే ఇలాంటి ప్రతిభావంతుల్ని గుర్తించి వారికి బాసటగా నిలుస్తున్నవారుమన సమాజంలో లేకపోలేదు. అలాంటి ఉన్నత మనస్సు కలిగిన వారిలో ఒకరు విశాఖ జిల్లా బాస్కెట్ బాల్ అధ్యక్షులు,ఎన్.ఐ.ఎఫ్.ఎస్ సి.ఈ.ఓ.సునీల్ మహంతి.
ప్రతి సంవత్సరం ఈయన కారణంగా ఎందరో విద్యార్థులు తమ చదువును ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తున్నారు.బాస్కెట్ బాల్ క్రీడలో ఆసక్తి కనబరుస్తున్న కొందరు క్రీడాకారులను సైతం ఈయన తన ఆర్థిక సహకారంతో చదివిస్తున్నారు.అందులో భాగంగానే శుక్రవారం మధురవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణతలైన పేదవిద్యార్థులకు విశాలాక్షినగర్ బి.వి.కె కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యకోసం 11మంది విద్యార్థులకు తన ఆర్థిక సహకారంతో వారి ఫీజులను చెక్కుల రూపంలో బి.వి.కె. కళాశాల ప్రిన్సిపాల్ రమా కు అందచేశారు.ఈకార్యక్రమంలో జిల్లా బాస్కెట్ బాల్ సెక్రటరీ భూషణరావు తదితరులు పాల్గొన్నారు.


