నేడే జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం కుమార్...
కరీంనగర్ : వి న్యూస్ : అక్టోబర్ 01:
సేవలందిచడంలో ఆయనకు ఆయనే సాటి.గత 12సంవత్సరాలుగా రక్తదాన చైతన్య యుద్ధంలో నేను సైతం అంటున్న ఔట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్ , బ్లడ్ మోటివేటర్ గాలిపేల్లి కుమార్కరీంనగర్ లో బ్లడ్ అంటే గుర్తుకు వచ్చే మొట్టమొదటి వ్యక్తి కుమార్.
అక్టోబర్ ఒకటవ తేదీ నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా గత 12 సంవత్సరాలుగా రక్తదాన చైతన్య యుద్ధంలో నేను సైతం అంటున్నా బ్లడ్ డోనర్ , బ్లడ్ మోటివేటర్ సామాజిక వేత్త గాలిపేల్లి కుమార్ బొమ్మకల్ గ్రామం , కరీంనగర్ మండలం , కరీంనగర్ జిల్లాకు చెందిన గాలిపేల్లి అంజమ్మ - దుర్గయ్య దంపతుల ఏకైక కుమారుడు గాలిపల్లి కుమార్ 10 వ తరగతి నుండి సామాజిక సేవ చేస్తూ ఇప్పటి వరకు 48 సార్లు రక్తదానం చేయడం జరిగింది. గత 12సంవత్సరాలుగా రక్తదాన చైతన్య కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటి వరకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వాట్సప్ , ఫేస్బుక్ , ట్విట్టర్ , ఇంస్టాగ్రామ్ ఇలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా 9,000 మందికి పైగా రక్తదానం పై అవగాహన కల్పించడం జరిగింది. వివిధ అత్యవసర సమయంలో ఉన్న వారికి ఇప్పటి వరకు 6,000 మందికి ఉచితంగా రక్తం అందించడం జరిగింది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఇప్పటి వరకు 30 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో ప్లాస్మాదానం పై అవగాహన కల్పించి 60 మందితో ప్లాస్మాదానం చేయించడం జరిగింది.
చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా కరీంనగర్ లో కోవిడ్ వచ్చిన వారికి ఉచితంగా 150 మందికి ఆక్సిజన్ అందిoచి ప్రాణాలు కాపాడటం జరిగింది,పల్స్ పోలియో పై ఎన్నో అవగాహన కార్యక్రమాలు,18 ఎర్స్ నిండిన యువతి యువకులకు ఓటర్ ఐ డీ కార్డ్స్ ఇప్పివ్వడం, హాస్పిటల్ లో వున్న వృద్దులకు హెల్ప్ చేయడo , కారొన టైం లో ఉచితంగా కూరగాయల పంపిణీ, ఫంక్షన్స్ లలో మిగిలిన ఆహారాన్ని తీసుకునీ పేదవారికి ఇవ్వడం,ఆరోగ్యంగా ఉన్న 18 - 60 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న స్త్రీ , పురుషులు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇంటి నుండి ఒక రక్త దాతలను తయారు చేయడమే లక్ష్యం గా ముందుకు సాగుతున్నారు ఆరోగ్యంగా ఉన్న వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. అదేవిధంగా రక్తదాతలందరికీ " నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే " శుభాకాంక్షలు. నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.