గాంధీ జయంతి సందర్భంగా "ఏక్-తారీఖ్-ఏక్-ఘంటా, కార్యక్రమం
అసోసియేషన్ పీపుల్ పవర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ్ భారత్ మిషన్ యొక్క 9 సంవత్సరాలు, పూర్తయిన సందర్భంగా స్వచ్ఛ భారత్ దివస్
భీమునిపట్నం : వి న్యూస్ : అక్టోబర్ 01:
భీమునిపట్నం సాగర తీరంలో లైట్ హౌస్ ఐ లవ్ భీమిలి దగ్గర అసోసియేషన్ ఆఫ్ పీపుల్ పవర్ ఆధ్వర్యంలో పార్లే ఫర్ ఇండియా మరియు బేతని పబ్లిక్ స్కూల్ పీఎం పాలెం ఎన్ సి సి విద్యార్థులు తీరం శుభ్రపరచడం జరిగింది దీనిలో అసోసియేషన్ సభ్యులు శివ గోపీనాథ్ మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని సముద్రాల జలాలు కాపాడుకోవాలని అలాగే జీవరాశులు మనుగడ ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బందికి గురి అవుతున్నాయని వాటిని తగ్గించడం ప్రజల యొక్క బాధ్యత అని విద్యార్థులకు తెలియజేయడం అలాగే ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగస్వాములు చేయాలని సూచించారు పీపుల్ పవర్ భాస్కర్ మాట్లాడుతూ చిన్నప్పుడు నుంచే పిల్లలకు పర్యావరణం పై అవగాహన కల్పించాలని యువత ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత ఉందని తెలిపారు పార్లే ఫర్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ ఎక్కువ శాతం ఆక్సిజన్ సముద్రాలు దగ్గర వస్తుందని పిల్లలకు తెలిపారు అవగాహన కల్పించారు ,పీపుల్ పవర్ సభ్యులు , జగదీశ్వరరావు , తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.