దానాలలో అన్నదానం గొప్పది. టిడిపి బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు.
మధురవాడ : వి న్యూస్ : సెప్టెంబర్ 29:
మధురవాడ: జీవీఎంసీ మధురవాడ పరిధి 5వ వార్డ్ లో వినాయక నవరాత్రి హోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.శుక్రవారం గణేష్ నగర్ శ్రీ విజయ గణపతి దేవాలయం సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రంది నాయుడు దంపతుల ఆర్థిక సహాయంతో సుమారు 6000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరియు బొట్టవానిపాలెం గ్రామంలో గ్రామయువత పెద్దల ఆధ్వర్యంలో సుమారు 5000మందికి భారీ అన్నసంతర్పణ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు హాజరై ముందుగా గణనాథుని దర్శించుకున్నారు. కమిటీ పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గణేష్ నగర్ లో ఆలయ సమన్వయ కమిటీ సభ్యులు రంది నాయుడు దంపతుల ఆర్థిక సాహాయం తో మరియు బొట్టవానిపాలెం యువత అధ్వర్యంలో మండపాల ప్రాంగణం వద్ద ఏర్పాటుచేసిన మహా అన్న సమరాధనలను ప్రారంభించి భక్తులకు వడ్డించారు.ఈ సందర్భంగా మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ..అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నారు.ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు సూచించారు. గణనాధుని దీవెలను అందరి పైనా ఉండాలని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను,వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్,సీనియర్ నాయకులు నమ్మి సూర్య అప్పారావు,ఇయ్యపు నాయుడు ఉపాధ్యక్షులు వియ్యపు నాయుడు,కొర్రాయి సురేష్ ,గణేష్ నగర్ విజయ గణపతి ఆలయ సమన్వయ కమిటీ సభ్యులు చలుమూరి శ్రీనివాసరావు,రంధి నాయుడు,వెంకటేశ్వరరావు, టెక్కలి మోహన్,బొట్టసురేష్, గణపతి ,పితాని వాసు,తాండ్ర సన్యాసిరావు,సంభాని సుజీవరవు,టెక్కలి అరుణమ్మ ,తదితరులు పాల్గొన్నారు.