శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవ ట్రస్టు ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ:-
వెల్లంకి: వి న్యూస్ : సెప్టెంబర్ 17:
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో వెల్లంకి గ్రామం లో ఆదివారం శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు పట్నాయకుని జాని కేశ్వరావు,ట్రస్ట్ చైర్మన్:- బిజేపి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ సొంత నిధులతో వినాయకుని మట్టి ప్రతిమలు అందరికీ ఉచితంగా పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్యదర్శి కంటి మహంతి శివ ప్రసాద్ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని వినాయక చవితి సందర్భంగా ఈ మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చాలా శుభ పరిణామాన్ని అని అన్నారు,ట్రస్ట్ వ్యవస్థాపకులు పి.జాని కేశ్వర రావు మాట్లాడుతూ మా ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గం లో అన్ని మండలాల్లో వార్డులలో ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా 1000 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం వలన చాలా సంతృప్తిగా ఉందని అన్నారు, చైర్మన్:- పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మట్టి విగ్రహాన్ని పూజించడం వల్ల నదులు సముద్రాలు చెరువులు లో ఉన్న నీరు కలుషితం కాకుండా కాపాడగలమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు;- బిజేపి ఆనంద పురం మండల పార్టీ అధ్యక్షులు:- మీసాల రాము నాయుడు,విశాఖ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు యోలూరు ధర్మవతి,బిజేపి నాయకులు బోర శ్రీను,పి.సాయి రమేశ్,పి.చిన్న రావు, కె.వి.వి.సూర్యనారాయణ మరియు బిజెపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
