గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో 45వ వార్డు లో టీడీపీ కమిటీల నియామకం.
విశాఖపట్నం ప్రతినిధి:
మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆశీస్సులతో నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు ఆధ్వర్యంలో 45వ వార్డు కమిటీ నియామకం జరిగింది. నూతన కమిటీ అధ్యక్షునిగా భరనికాన రాజు, ప్రధాన కార్యదర్శి గా నరేంద్ర కుమార్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు పైలా ముత్యాల నాయుడు, జిల్లా ఐటిడిపి నరేష్, వాసుపల్లి రాజు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

