జగనన్నకు చెబుదాం అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
విశాఖ రూరల్ మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహణ.
మండల స్థాయి జగనన్నకు చెబుదాం కు 60 అర్జీలు.జిల్లా కలెక్టర్ డా ఏ మల్లికార్జున.
విశాఖపట్నం,వి న్యూస్ సెప్టెంబర్ 22 :
జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం విశాఖ రూరల్ మండలం, యన్టీఆర్ కాలనీ సచివాలయం అవంతి ఫంక్షన్ హాల్ నందు మండల స్థాయి ''జగనన్నకు చెబుదాం '' ( స్పందన ) కార్యక్రమం నిర్వహించారు. విశాఖ రూరల్ మండల పరిధిలో ఉన్న గ్రామ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణంగా ప్రతి సోమవారం జిల్లా ప్రధాన కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్నకు చెబుదాం కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాటు చేసిందని చెప్పారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 8వ తేది నుండి అక్టోబర్ 13 వ తేది వరకు బుధవారం, శుక్రవారం వారంలో రెండు రోజులలో మండల కేంద్రాలలో నిర్వహిస్తున్నామని చెప్పారు.
అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ లో లేకుండా చూడాలని అన్నారు. విభాగాధిపతులందరూ ఈ కార్యక్రమం పై పూర్తి శ్రద్ధ వహించి పనిచేయాలన్నారు. వచ్చిన అర్జీలలో ప్రధానంగా రెవెన్యూ, జివిఎంసి , హౌసింగ్ , ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను సకాలంలో విచారణ జరిపి సత్వర చర్యలు తీసుకుంటామని అన్నారు.
శుక్రవారం విశాఖ రూరల్ నిర్వహించిన మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి 60 విజ్ఞప్తులు అందాయి.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ , ఆర్ డి ఓ భాస్కర్ రెడ్డి, జివియంసి అడిషనల్ కమిషనర్ వర్మ, పోలీస్ అధికారులు, వివిధ శాఖల జిల్లా , డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.