జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు యూత్ టెక్వాండో క్రీడాకరులు....
యలమంచిలి వి న్యూస్
ఎలమంచలిలో జరిగిన సబ్ జూనియర్ మరియు క్యాడట్ జిల్లా స్థాయి & రాష్ట్ర స్థాయి టెక్వాండో పోటీలో మధురవాడ యూత్ టెక్వాండో క్లబ్
క్రీడాకారులు అనేక విభాగాల్లో క్రీడాకారులు పాల్గొనగా 10 బంగారు,1 కాంస్యపతకం సాధించారు అని కోచ్ సురేష్ మరియు సుకుమార్ సంపత్ తెలియజేశారు. క్రీడాకారులను అంభినందించి మరుపిల్లి చిన్నా రావు వై ఎస్ ఆర్ సి పి భీమిలీపట్నం బూత్ అధ్యక్షుడు మరియు వి.నాగబాబు, తిరుపతి రావు, జి.అశోక్, క్రీడాకారులను ప్రోత్సహించి వారికి,టైక్వాండో యూనిఫారం బహుమతి గా ఇచ్చారు. అదేవిధంగా ముందు ముందు మరెన్నో గొప్ప విజయాలను అందు కోవాలని ప్రోత్సహించారు.
ఈ ప్రకటన లో బంగారు పతకాలు సాదించిన క్రీడా కారులు మార్చ్ 28 నుండి 31 వరకు రాజస్థాన్ కోట లో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటారు అని రాష్ట్ర టైక్వాండో కార్యదర్శి పి అచ్చుత రెడ్డి మరియు జిల్లా టెక్వాండో సెక్రెటరి ఎం.అచ్చన్నాయుడు తెలియచేసారు.

