తిరుపతి లో గల శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నవీన్ జ్ఞానేశ్వర్
ఆనందపురం: విశాఖ లోకల్ న్యూస్ ఆగస్టు 20
ఆనందపురం మండలం మరియు వేములవలస పంచాయతీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తన తండ్రి మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు తిరుమల తిరుపతి వెంకన్నకు మొక్కుకున్నారని కరోనా కష్టకాలంలో కూడా అందరూ ఆరోగ్యంగా ఉండడంతో మొక్కుబడి తీర్చుకున్నట్లు వేములవలస పంచాయితీ ఉప సర్పంచ్ కోరాడ జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతి లో గల శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. ఇతనితో పాటు ఎర్రాజీ స్వామి నాయుడు, నడిమింటి అప్పల్రాజు, కోరాడ మహేష్, నడిమింటి రాజు లు ఉన్నారు.