అమరావతి నగర్లో శ్రీపైడితల్లమ్మ ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవం



 మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్ ఆగస్టు 20

అమరావతి నగర్లో శ్రీపైడితల్లమ్మ ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవం

శ్రీపైడితల్లమ్మ ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. 6వ వార్డు పరిధిలో గల అమరావతి నగర్లో శనివారం ఉదయం 8.43నిమిషాలకు అమ్మవారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం ఆలయ ధర్మకర్త పసుపులేటి గోపీనాథ్ చేతుల మీదుగా గావించారు. అనంతరం ఆలయ శిఖరం పై పూర్ణ కుంభ ప్రతిష్ట గావించారు. శనివారం ఉదయం 6గంటల నుంచి ఆలయ ప్రారంభోత్సవ కార్య్రమాల్లో భాగంగా తప్పుటగుళ్ళు, జమికులు, డప్పులు, సన్నాయిమేళం, పేరంటాల్లాతో పతాలు,  వంటి కార్యక్రమాలు నిర్వహించి పంచముఖ ఆంజనేయ స్వామి మందిరం వద్ద నుండి అమరావతి కాలనీ వరకు అంగరంగ వైభవంగా ఊరేగింపు చేపట్టామని ఆలయ ధర్మకర్త పసుపులేటి గోపీనాథ్ తెలియచేశారు. ఉదయం 8.43 నిమిషాలకు ఆలయ ప్రతిష్ట చేపట్టామని, మధ్యాహ్నం 12 గంటల నుండి సుమారు 2000 మందికి అన్నప్రసాద కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఆలయ దర్శనానికి ఆదివారం 9గంటలకు వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజక వర్గ శాసన సభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు విచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. రాత్రి 7గంటల నుండి 11గంటల వరకు పలు సాంస్కృతిక కార్య్రక్రమాల నిర్వాహణలో భాగంగా రేలారే రేలా, క్లాసికల్ అండ్ వెస్ట్రన్ డాన్స్ ప్రోగ్రామ్స్, నంది అవార్డు గ్రహీత వంకాయల మారుతి ప్రసాద్ వీరబాహునిగ అమ్మక ఘట్టం ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం అమ్మవారి సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. అమ్మవారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో 5,6,7 వార్డులో వైఎస్సార్సీపీ అధ్యక్షులు పోతిన హనుమంతరావు, బొట్ట అప్పలరాజు, పోతిన శ్రీనివాసరావు, బంగారు ప్రకాష్, జె.ఎస్.రెడ్డి, పసుపులేటి సురేష్,  ఆలయ కమిటీ సభ్యులు భాస్కర్, ఎం.శ్రీనివాస్, శంకర్, మోహన్, వెంకటేష్, శ్రీనివాసరావు, రాము, మహేష్, దివాకర్, నాయుడు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు