అడ్డగోలు నిర్మాణాల వల్ల డ్రైనేజీలు ఇళ్లలోకి వస్తున్న వైనం.
విశాఖ లోకల్ న్యూస్ :ఆగష్టు 20:మధురవాడ
మధురవాడ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది దిన దినాభివృద్ధి చెందుతున్న ప్రాంతం అలాంటి మధురవాడ ప్రాంతంలో నిత్యం డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంటాయి. ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ మధురవాడ లో బహుళ అంతస్తులు అపార్ట్మెంట్లు రావడం వల్ల వాళ్లు ప్లాన్ కి వ్యతిరేకంగా సెట్ బాక్స్, డ్రైనేజీ లకి పైపులైన్లు సరిగా కనెక్షన్ ఇవ్వకపోవడంతో డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఉంటాయి. అలాంటి సమస్యల్లోనే 8వ వార్డ్ మిథిలాపురి వుడా కాలనీ ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ వెనుక భాగంలో మల్లెపందిరి అనే కన్స్ట్రక్షన్ పేరుతో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ యాజమాన్యం డ్రైనేజీ వెళ్లే మార్గాన్ని వాళ్లు మూసివేయటం చేయడం వల్ల ఆ డ్రైనేజీలో నీరంతా మా ఇళ్లల్లోకి వచ్చేస్తుందంటూ అక్కడ నివసిస్తున్న " ఆనంద్స్ బే హాట్స్" కొందరు అపార్ట్మెంట్ వాసులు, కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనికి ముఖ్యకారణం జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యంగాను లేక రాజకీయణాయకుల ఒత్తిడికి తలోగ్గుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు.ఆ డ్రైనేజీ ల వల్ల దుర్వాసన ,విష జ్వరాలు, వస్తున్నాయని చిన్నపిల్లలతో ఇక్కడ నివసిస్తున్నామని, ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసిన పట్టించుకోవటంలేదని ఇప్పటికైనా ఉన్నతధికారులు మా యొక్క సమస్యలను గుర్తించి పరిష్కారం చెయ్యాలని కోరుతున్నారు.