భీమిలి:విశాఖ లోకల్ న్యూస్
బిజేపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్.'శ్యాం ప్రసాద్ ముఖర్జీ' జయంతి
భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం వెల్లంకి శ్రీ శుభ బలరాం నిలయం లో బుధవారం ఉదయం 10 గంటలకు జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్.'శ్యాం ప్రసాద్ ముఖర్జీ' జయంతి సందర్భంగా బిజేపి కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర సోషల్ మీడియా కన్వీనర్ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్,బిజేపి అనందపురం మండల అధ్యక్షులు మీసాల రాము నాయుడు ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆనందపురం మండలంలో వెల్లంకి,ఆనందపురం, మండలo లో పలు దేవాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజేపి ఆనందపురం బిజేపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు మాట్లాడుతూ ఈ సందర్భంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జాతీయవాద ఆలోచనను ప్రోత్సహించి,జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పని చేసిన మహోన్నతుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు..బిజేపి విశాఖ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు,యేలూరి ధర్మవతి, మాట్లాడు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన తన భావజాలం తో.. సుధీర్ఘ పోరాటంతో దేశ రాజకీయ వ్యవస్థపై చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి, గండి లక్ష్మి రావు,ఆనందపురం మండల ప్రధాన కార్యదర్శి గ్రండేటి వెంకటరావు,బిజేపి సీనియర్ నాయకులు బోర శ్రీను, అనందపురం మండల ఎస్సీ మోర్చ నాయికులు నిమ్మకాయల అప్పల రాజు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


