అభిమానుల ఆధ్వర్యంలో గాడు.వెంకటప్పడు జన్మదిన వేడుకలు


  భీమిలి:విశాఖ లోకల్ న్యూస్

 అభిమానుల ఆధ్వర్యంలో గాడు.వెంకటప్పడు జన్మదిన వేడుకలు 

డి.ఎల్ డి.ఏ చైర్మన్  గాడు.వెంకటప్పడు పుట్టిన రోజు వేడుకలు మండలం లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలుసేవా కార్యక్రమాలుకి శ్రీ కారం చుట్టారు. అందులో భాగంగానే తగరపువలస  అంబేద్కర్  జంక్షన్ కూడలి లో సాయిరాం కుకింగ్ & కేటరింగ్ ప్రొ"టి.పి రాజు ఆద్వర్యంలో  సుమారు 500 మంది పేదలకు అన్నదానం ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా  భీమునిపట్నం సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్  చిరంజీవి  విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో నీలాపు సూర్య నారాయణ ,గాడు అప్పలనాయుడు, మాకాల వెంకట అప్పారావు, సురాల వెంకట రావు ,కనకల త్రినాద్  మరియు ఆయన అభిమానులు పాల్గున్నారు!