'అమ్మఒడి’కి లక్ష మంది దూరం

'అమ్మఒడి’కి లక్ష మంది దూరం.

విశాఖ లోకల్ న్యూస్ 



అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది.

పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. 

అమ్మఒడి కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

ఈ పథకంలో ఈ ఏడాది రాష్ట్రంలో లక్ష మందికిపైగా కోత పెట్టింది.

పాఠశాలలకు గైర్హాజరు కావడంతో 51 వేల మందిని ప్రభుత్వం అనర్హులుగా తేల్చింది.

వేర్వేరు కారణాలతో మరో 50 వేల మందికి అమ్మఒడి నిలిపివేసింది.