లారీ కారు ఢీకొన్న సంఘటనలో ఏడుగురికి గాయాలు.

 లారీ కారు ఢీకొన్న సంఘటనలో ఏడుగురికి గాయాలు.

విశాఖ లోకల్ న్యూస్ (విజయనగరం జిల్లా) బొండపల్లి:-

లారీ కారు ఢీకొన్న సంఘటనలో ఏడుగురు గాయపడ్డారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొండపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం రాంబద్రపురం నుండి విశాఖపట్నం వెళ్తున్న లారీ విజయనగరం నుంచి గజపతినగరం  వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు యజమాని బొండపల్లి మండలం గిట్టుపల్లె గ్రామానికి చెందిన లగుడు దేవుడు తోపాటు లారీ డ్రైవర్ రాంబద్రపురం గ్రామానికి చెందిన పూడి రామకృష్ణ , రాంబద్రపురం మండలం కొట్టక్కి గ్రామానికి చెందిన బూరాడ పోలినాయుడు, బూరాడ చంద్రశేఖర్, పెదమానాపురం గ్రామానికి చెందిన చిల్లా సురేష్ , గోటివాడ నాజర్, బొంగ పావని లు గాయపడ్డారు. గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం  జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే మొబైలు హెచ్. సి. నాగరాజు సిబ్బందితో వెళ్లి చర్యలు చేపట్టారు. అదేవిధంగా గజపతినగరం సి.ఐ. డి. రమేష్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.