శ్రీ విజయదుర్గ మల్లిఖార్జున దేవాలయం పుష్కర వార్షికోత్సవ వేడుకలకు స్వరూపానందేంద్ర మహా సరస్వతి స్వామికి ఆహ్వాన పత్రిక.

 శ్రీ విజయదుర్గ మల్లిఖార్జున దేవాలయం పుష్కర వార్షికోత్సవ వేడుకలకు స్వరూపానందేంద్ర  మహా సరస్వతి స్వామికి ఆహ్వాన పత్రిక.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

మధురవాడ అయోధ్యనగర్ లో వేంచేసియున్న  శ్రీ విజయదుర్గ మల్లిఖార్జున దేవాలయం పుష్కర వార్షికోత్సవ వేడుకలకు ఈ నెల 17,18,19 తేదీల్లో వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర  మహా సరస్వతి స్వామి మరియు  శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారిని ఆలయ ధర్మకర్త మరియు ది గ్లోబ్ స్కూల్ చైర్మన్ అండ్ కరస్పాండెంట్ బి.వెంకటరావు,అనూరాధ దంపతులు  చిన ముషిడివాడలోని విశాఖ శ్రీ
శారదా పీఠానికి వెళ్లి స్వామివారికి ఆహ్వాన పత్రికను అందజేసి స్వామి ఆశీర్వచనం పొందటం జరిగింది. ఈ సందర్భంగా పుష్కర వార్షికోత్స వాలు స్వామివారి ఆశీస్సులతో మరియు వారి చేతుల మీదుగా నిర్వహించాలని కోరడం జరిగింది.