నేపాల్ లో విమానం మిస్సింగ్.. అందులో నలుగురు భారతీయులు.

 నేపాల్ లో విమానం మిస్సింగ్.. అందులో నలుగురు భారతీయులు.

న్యూఢిల్లీ: నేపాల్‌లో ఓ విమానం అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం తారా ఎయిర్‌కు చెందిన 9 NAET ట్విన్‌ ఇంజిన్‌ విమానం ఆచూకీ గల్లంతైంది. కాగా, ఈ విమానం పోఖారా నుంచి నేపాల్‌లోని జోమ్‌సోమ్‌కు వెళ్తుండగా ఉదయం 9.55 గంటలకు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయని అధికారులు ధృవీకరించారు. మరోవైపు.. జోమ్‌సోమ్‌లోని సమీపంలో ఉన్న దౌలత్‌గిరి పర్వతం వైపు విమానం మళ్లిన తర్వాతే ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్టు తెలుస్తోంది.

కాగా, తప్పిపోయిన విమానంలో ముగ్గురు విమాన సిబ్బందితో సహా 19 మంది ప్రయాణీకులు ఉండగా.. వారిలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపానీయులు ఉన్నట్టు సమాచారం.  విమానం సిగ్నల్స్‌ కట్‌ అవడంతో గాలింపు చర్యల కోసం ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినట్టు తారా ఎయిర్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు.