పరదేశి పాలెం నుండి కాపులుప్పాడకు వెళ్లే మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు.
పరదేశి పాలెం : వి న్యూస్ : జూలై 19:
పరదేశి పాలెం నుండి కాపులుప్పాడకు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పరదేశిపాలెం గెడ్డ వద్ద ఉదృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో పరదేశిపాలెం, కాపులప్పాడ, మధురవాడ జాతియ రహదారికి వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానికులు గెడ్డపై వున్న వంతెనను ఎత్తులో నిర్మించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

