గోల్డ్ మెడల్ ప్రతిభా పురస్కార్ అవార్డ్ అందుకున్న సింహాచలం దేవస్థానం ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్

గోల్డ్ మెడల్ ప్రతిభా పురస్కార్ అవార్డ్ అందుకున్న సింహాచలం దేవస్థానం ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్

సింహాచలం : పెన్ షాట్ ప్రతినిధి : సెప్టెంబర్ 27:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక శాఖతో పాటు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ గోల్డ్ మెడల్ ప్రతిభా పురస్కార్ అవార్డ్ ను అందించాయి. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విజయవాడ బలోత్సవ భవన్ ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఆకర్షణ కలిగిన పర్యాటక ప్రాంతాలు, పురాతన, దేవాలయాల విశిష్టతలను తెలిపే ఒక ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక ,సాంస్కృతిక శాఖ నిర్వహించింది.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జి సాయి ప్రసాద్ ఐ ఏ ఎస్, ఎమ్ డి ఇంతియాజ్ ఐ ఏ ఎస్ పాల్గొన్నారు.
ఈ పోటీలలో సింహాచలం దేవస్థానం ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ కి గోల్డ్ మెడల్ ప్రతిభా పురస్కార్ అవార్డ్ కు ఎంపికయ్యారు.

ఈ పోటీ ద్వారా మన పర్యాటక ప్రాంతాలు, ఆలయాల గొప్పదనం దేశవ్యాప్తంగా తెలియపర్చాలనే లక్ష్యంగా నిర్వహించింది. ఈ పోటీ కోసం శ్రీనివాస్ పురాతన దేవాలయాల కేటగిరిలో ఫోటోలను పంపించారు. ఈ ఫోటోలకే గోల్డ్ మెడల్ ప్రతిభా పురస్కార్ అవార్డ్ దక్కింది ఆయనకు దక్కిందని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా నేను తీసే ప్రతి ఫోటోలో మంచి, చెడులు చెప్పి ఫోటోగ్రాఫర్ గా నన్ను నిలబెట్టింది మీరే మీతో పాటు నాకు ఎల్లవేళలా తోడుండే శ్రీ వరాహ లక్ష్మినృసింహ స్వామి దయతో ఫోటోగ్రాఫర్ గా నా ప్రయాణంలో మరో అపురూపమైన బహుమతి చేరింది అని అన్నారు.ఈ విజయాన్ని, బహుమతిని మనందరిని ఎల్లప్పుడూ కాపాడే ఆ శ్రీ వరాహ లక్ష్మినృసింహ స్వామి పాదాలకు అంకితమిస్తున్నాను అని అన్నారు.