18వరోజు నిరాహార దీక్షా శిబిరాన్ని నిర్వహించిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి కోరాడ రాజబాబు
భీమిలి : వి న్యూస్ : సెప్టెంబర్ 27:
భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తన జీవిత ఆశయంగా , వారికి అన్ని విధాలుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని స్కీల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేసి కొన్ని లక్షల మంది పేద విద్యార్థులకు వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించి వారి ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి ,మరియు అభివృద్ధికి కృషి చేసిన మా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ *భీమిలి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మరియు తెలుగు పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు * ఆధ్వర్యంలో భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 18వరోజు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని జీవీఎంసీ 1,2,3,4 వార్డుల నాయకులతో నిరసన తెలియజేస్తూ నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితోపాటు రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు మూడో డివిజన్ కార్పొరేటర్ గంటా అప్పలకొండ రెండో డివిజన్ సీనియర్ నాయకులు గాడు అప్పలనాయుడు ఒకటో డివిజన్ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు రాష్ట్ర పద్మశాలి సాధికార సభ్యులు వానపల్లి సత్య విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చిలకా నరసింగ రావు సోడిపిల్లి నారాయణరావు టి ఎన్ టి యు సి నాయకులు నరవ రామారావు రెండో డివిజన్ ఉపాధ్యక్షులు జగన్నాథం గణేష్ రెడ్డి నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు పాసి త్రినాథ్ కుమార్ జనరల్ సెక్రెటరీ దంతులూరి సిద్ధార్థ వర్మ నాలుగో డివిజన్ సీనియర్ నాయకులు గరికిన ఎల్లయ్య మూడో డివిజన్ తెలుగు యువత అధ్యక్షులు కనకల అప్పలనాయుడు సెక్రెటరీ కంచర్ల కామేష్ మూడో డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొక్కిరి అప్పన్న అధికార ప్రతినిధి కాసరాపు ఎల్లాజీ ఒకటో డివిజన్ తెలుగు యువత అధ్యక్షులు గరే సదానంద సుబ్బు రెండో డివిజన్ తెలుగు యువత అధ్యక్షులు దుర్గ రావు భీమిలి నియోజకవర్గం ముఖ్య నాయకులు మహిళా కార్యకర్తలు కార్యకర్తలు ప్రజలు పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగింది.