ఏడవ వార్డు కార్యాలయం, వాహనాల యార్డ్ వద్ద మూడో రోజు కొనసాగుతున్న క్యాబ్ డ్రైవర్లు సమ్మె
మధురవాడ: వి న్యూస్ : సెప్టెంబర్ 27:
కనీసం 18-500/రూపాయలు జీ ఓ 7 ప్రకారం వేతనం ఇవ్వాలి...
క్లాప్ డ్రైవర్లు సమ్మె మూడో రోజు కొన సాగింపు.. సి ఐ టీ యు.
మహా విశాఖ నగర పాలక సంస్థ లో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేసే క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ వాహనాల డ్రైవర్లు ఈ నెల 26 వ తారీకు నుండి నిరవధిక సమ్మె లోకి వెళ్ళారు.
కాంట్రాక్టర్,జీ వి ఎం సి అధికారులు,కమీషనర్,వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం అందరూ కలిసి ఈ పరిస్థితికి కారణం అని సి ఐ టీ యు మధురవాడ జోన్ కమిటీ విమర్శించింది.
సిఐటియు మధురవాడ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ సంవత్సర కాలం నుండి పోరాడుతున్న మా సమస్యలు పరిష్కారం చేయకుండా, వాయిదాలు వేస్తూ వస్తున్నారని, ఇది చాలా అన్యాయమని యూనియన్ మధురవాడ జోన్ నాయకులు ఎస్ చిన్న, కె సన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ఏడవ వార్డు కార్యాలయం, వాహనాల యార్డ్ వద్ద మూడోరోజు సమ్మె కొనసాగుతూ గురువారం బైఠాయించారు. అనేక సందర్భాలలో టోకెన్ సమ్మెలు, చేసి నిరసనలు తెలియజేసి, వినతి పత్రాలు ఇచ్చిన సందర్భాలలో, మా సమస్యలపై చర్చించడానికి,మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాకు చాలా బాధ కలిగిస్తుందని అన్నారు.జోన్ టూ లో 64 వాహనాలకు 70 క్లాప్ డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమ్మెలో పాల్గొన్న డ్రైవర్లకు మెమోలు జారీ చేసి ఉద్యోగాలనుండి తొలగించి నూతన డ్రైవర్లను నియమించుకుంటామని బెదిరిస్తున్నారని అన్నారు. ఇతర అవసరాలు కనీసం తీరాలంటే 26000/- జీతం ఉండాలని అన్నారు సాధారణంగా డ్రైవర్లకు జీ ఓ 7 ప్రకారం ఇచ్చే 18,500/- ఇవ్వాలని కోరిన ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. క్లాప్ డ్రైవర్లు సమ్మె కు పూర్తిగా మద్దతు వుంటుందని తెలియ జేశారు.18,500/- ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జోన్ నాయకులు పి అశోక్,పి శ్రీను,బి శివ,రాంబాబు అధిక సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు.