భీమిలి నియోజకవర్గానికి భారీగా పెట్టుబడులు

భీమిలి నియోజకవర్గానికి భారీగా పెట్టుబడులు

జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా భీమిలిలో  అవంతిని శాసనసభ్యులుగా చేయాలి.

ఎక్సైజ్ కాంప్లెక్స్ శంకుస్థాపన సభలో వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడి

హాజరైన ఎక్సైజ్శాఖ మంత్రి నారాయణస్వామి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్

ఆనందపురం : వి న్యూస్ : సెప్టెంబర్ 28:

విజయదశమి నాటికి పరిపాలన రాజధాని భీమిలి నియోజకవర్గానికి తరలి రానున్నదని, దీంతోపాటు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం సుమారు 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతోందని వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై.వీ.సుబ్బారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆనందపురం మండలం గోరింట గ్రామంలో సుమారు 5 ఎకరాలలో 20 కోట్ల రూపాయలు వ్యయంతో ఎక్సైజ్ కాంప్లెక్స్ నిర్మాణానికి వై.వి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కే.నారాయణస్వామి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో రానున్న మూడు, నాలుగు నెలల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించారని తెలియజేశారు. ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన రైతులకు 28 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించామని ఆయన చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి వివిధ పరిశ్రమలతో చేయించిన ఘనత మంత్రి గుడివాడ అమర్నాథ్కు దక్కిందని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో పేదవాడు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, పేదల తలరాతలు మార్చేందుకు, వారి పిల్లలకు నాణ్యతతో కూడిన ఆంగ్ల విద్యను అందిస్తున్నారని చెప్పారు. తాను మీ కుటుంబానికి మేలు చేశాను అన్న భావన కలిగితే తనకు ఓటేయాలని జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్పగలుగుతున్నారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇటువంటి ప్రకటన చేయగలిగారా? అని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రనేమార్చారని మంత్రి నారాయణస్వామి కొనియాడారు. చంద్రబాబు నాయుడు పై అన్యాయంగా కేసులు బనాయించారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోందని, అయితే జనం వాటిని నమ్మకుండా వాస్తవాలు తెలుసుకున్నారని అన్నారు.

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఎక్సైజ్ కాంప్లెక్స్ ఈ ప్రాంతానికి రావడం వలన స్థానికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. తెలియజేశారు. సీఎం విశాఖకు వస్తున్న నేపథ్యంలో భీమిలి ప్రాంతానికి ప్రాముఖ్యత పెరిగిందని అమర్నాథ్ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు దృష్టి సారిస్తున్నారని ఆయన వివరించారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గ స్వరూపం పూర్తిగా మారబోతుందని, దీంతోపాటు ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయని తెలియజేశారు. విశాఖపట్నం పోర్టు నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ఆరు లైన్ల రహదారి రానున్నదని చెప్పారు.