చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్, లోకేష్ ములాఖత్

చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్, లోకేష్ ములాఖత్

ఏపీ:వి న్యూస్ :సెప్టెంబర్ 14:

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్, లోకేష్ ములాఖత్ అయ్యారు..

చంద్రబాబును పరామర్శించి, అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. దాదాపు 40 నిమిషాల పాటు ములాఖత్ ఉండే అవకాశం ఉంది. ములాఖత్ తర్వాత జైలు దగ్గర ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్దకు చేరుకున్నారు. పవన్‌కళ్యాణ్‌ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి రాజమండ్రికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలు కంటే ముందు టీడీపీ క్యాంప్ కార్యాలయానికి పవన్‌ కళ్యాణ్ వెళ్లారు. చంద్రబాబు భార్య భువనేశ్వరితో కొద్దిసేపు పవన్‌ కళ్యాణ్‌ చర్చలు జరిపారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్దకు వచ్చారు. ఆరు వాహనాల కాన్వాయ్‌తో పవన్ కళ్యాణ్ జైలు వద్దకు చేరుకోగా.. ఆరు వద్దు, ఒక కారు సరిపోతుందని అధికారులు సూచించారు. పవన్‌ వెంట జైల్లోకి వెళ్లేందుకు జనసేన నాయకుడు కందుల దుర్గేష్‌ ప్రయత్నించగా.. ఇష్టానుసారంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంపై అధికారుల అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది..