సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లపై పెత్తనం.

సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లపై పెత్తనం ...                                                                            : 

అమరావతి:

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి వారి ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా చక్కబెడుతున్న విషయం తెలిసిందే. ఆయా వార్డు, గ్రామ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వీరు వారదులుగా నిలుస్తున్నారు. మానస పుత్రికగా గుర్తింపు పొందిన వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు పూర్తయింది. గ్రామాలలో వాలంటీర్లు సకల పనులను చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వాస్తవానికి వారంలో మూడు రోజులు మాత్రమే వీరికి పని ఉండే విధంగా5000 వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ వారితో వెట్టి చాకిరి చేయిస్తున్నారని కొందరి విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామా ఆయా వార్డులో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలు వీరి ద్వారానే నిర్వహిస్తున్నారు. 50 నివాస గృహంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను వీరు గుర్తిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరి కంటే ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి నెల 22 వేల రూపాయలు జీతం ప్రభుత్వం చెల్లిస్తుంది. సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, గ్రామ కార్యదర్శి, ఆరోగ్య కార్యకర్త, ఇతర విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు ఉంటున్నారు. వారికి సంబంధించిన బాధ్యతలు సైతం వాలంటీర్లపైనే అప్పగించి పైపైగా జీతాలు తీసుకుంటూ ఉన్నారన్న విమర్శలు ప్రజల తరఫున వినిపిస్తున్నాయి. కాపు నేస్తం ,అమ్మ ఒడి, చేయూత పెన్షన్, బియ్యం పంపిణీ ఇలా అన్ని కార్యక్రమాలను వాలంటీర్ల నిర్వర్తించాల్సి వస్తోంది. ఆయా వార్డులో వాలంటీర్ల ద్వారానే అన్ని పనులను చక్కబేట్టాలని చూస్తున్నారు. లబ్ధిదారులు తంబులు వేయడానికి వాలంటీర్ లోనే ఉపయోగిస్తున్నారు కొన్ని కొత్త కొత్త యాప్ తీసుకొచ్చి వాటిని వెంటనే ఫీల్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఈ పనులను సైతం వాలంటీర్లు పూర్తి చేయాల్సి వస్తుంది ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అర్హులైన వారి గురించి సర్వేలు నిర్వహించేందుకు సంబంధిత విభాగాలు అధికారులు క్షేత్రస్థాయిలోకి రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి పనిని వాలంటీర్లతో చేయించి పై ఉద్యోగులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ సర్వే సంబంధిత ఉద్యోగులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాలంటీర్లు వస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. సిటిజన్ సర్వే సైతం వాలంటీర్ల ద్వారానే పూర్తి చేయించడం ఆశ్చర్యం కలిగిస్తుంది . వాలంటీర్లకు ప్రభుత్వం ఇస్తున్న 5000 రూపాయల గౌరవ వేతనం ఏమాత్రం సరిపోవడంలేదని కొందరు వాలంటీర్లు పేర్కొంటున్నారు. సర్వేల పేరుతో నిరంతరం సెల్ఫోన్ వాడాల్సి వస్తుందని ప్రతినెల 1500 దాకా నెట్ బిల్ కడుతున్నట్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ద్విచక్ర వాహనానికి పెట్రోల్ ఖర్చులు సొంత జేబు నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పదివేల రూపాయలు గౌరవ వేతనం చేయగలిగితే వాలంటీర్లకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు . ఇదిలా ఉంటే  సచివాలయ వ్యవస్థ లో పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించి ప్రభుత్వం వారితో పూర్తిస్థాయిలో పని చేయించడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. సచివాలయం లో పని చేస్తున్న సిబ్బందికి ఇప్పటికి పని పై అవగాహన లేదని ప్రజలు ముక్త ఖంఠంగా చెప్తున్నారు.ప్రతి పనికి వాలంటీర్లను ఉపయోగించుకుని వారి పెత్తనం కొనసాగించుకొని  పెత్తనం చూపిస్తున్నారని వాలంటీర్లు చర్చించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అన్ని సర్వేలు వాలంటీర్లు ద్వారానే చేయిస్తున్నారని ఈ సర్వే వల్ల గ్రామాలలో అన్నిటికీ కీలకంగా ఉన్నామన్న అభిప్రాయం ప్రజల్లో కలిగే విధంగా పరిస్థితి మారిపోయిందని పేర్కొంటున్నారు. దీంతో పలువురు అనర్హులకు లబ్ధిదారులకు ఏమైనా పథకాలు రాకపోతే వాలంటీర్లను టార్గెట్ చేసి వాలంటీర్లపై సాప నార్థాలు పెడుతున్నారని పేర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి విషయాన్ని వాలంటీర్ల మీద మోపడం వల్ల గ్రామాలలో వాలంటీర్లపై ప్రజలకు అప నమ్మకం ఏర్పడుతుందని కొందరు వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.