అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చే విధంగా ఆంధ్రప్రదేశ్: టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్
అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ అన్నారు.
జీవీఎంసీ జోన్ టు మధురవాడ 7వ వార్డ్ శుద్ధగెడ్డ
ప్రాంతంలో నిరుపేదలకు నిర్మిస్తున్న టిడ్కో గృహాలను సోమవారం అకస్మాత్తుగా టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చెర్మెన్ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సొంతిల్లు అనేది ఒక కళని ఆ కలను నెరవేర్చాలని ఉద్దేశంతో అత్యధిక టెక్నాలజీతో పేదవాడికి ఇళ్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారని దానిలో భాగంగానే మధురవాడ వాంబేకాలనీ శుద్ధగెడ్డ ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి రావడం జరిగిందని అలాగే ఇక్కడ 240 ఇళ్లను ఏ ,బి ,సి క్యాటగిరీ గా విభజించి త్వరలోనే ప్రతి లబ్ధిదారికి అందజేస్తామని తెలిపారు.అలాగే స్థానికంగా ఉన్న రజకులు చైర్మన్ ను కలిసి నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి మాకు అందజేయవలనని మధురవాడ రజక సంఘం నాయకుడు నరవ చంటి చెర్మెన్ ప్రసన్న కుమార్ ని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో సి ఓ ఉమ (కమ్యూనిటీ ఆర్గనైజర్ ) సోషల్ వర్కర్ ఆదినారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.