ఏఎన్‌ఎంకు సేవా రత్న అవార్డు: అభినందించిన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌

ఏఎన్‌ఎంకు సేవా రత్న అవార్డు: అభినందించిన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌

విశాఖపట్నం, ఆగస్టు 18:

పిఠాపురంకాలనీ పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్‌లో ఏఎన్‌ఎంగా పని చేస్తున్న బీకే కుమారికి సెయింట్‌ మదర్‌ థెరీసా సోషల్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ ‘సేవా రత్న`2022’ అవార్డు అందజేసింది. కరోనా సమయంలో కుమారి అందజేసిన సేవల్ని గుర్తించి ఆ సంస్థ ఆమెను సత్కరించింది. ఈ సందర్భంగా గురువారం 22వ వార్డు సచివాలయంలో జరిగిన అవార్డు బహూకరణ కార్యక్రమంలో కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని కుమారిని అభినందించారు. పేదల పట్ల కుమారి చేసిన సేవల్ని కొనియాడుతూ ఆమె మరిన్ని అవార్డులు, రివార్డులు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సూరిబాబు, పిఠాపురంకాలనీ సచివాలయ సెక్రెటరీలు శ్రీలక్ష్మి, హరిత, జగన్‌, రవితేజ, నాగమణి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.