రమేష్ చేతిలో కెమెరా క్లిక్ మంటే రసజ్ఙ చిత్రం ఆవిష్కరణ కావల్సిందే!
మెగా ఫొటో ఎగ్జిబిషన్ లో రమేష్ చిత్రాలకు స్థానం.కోనసీమ ప్రకృతి అందాలు, అక్కడి ప్రజల జీవన శైలి పై వి డెంటల్ హాస్పిటల్స్ డైరెక్టర్ కె.ఎం.కె.రమేష్ తీసిన ఛాయా చిత్రాలు మెగా ఫొటో ఎగ్జిబిషన్ లో ప్రదర్శన కు ఎంపిక అయ్యాయి. ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా వాల్తేర్ ఫొటో గ్రాఫిక్ సొసైటి ఆద్వర్యం లో రెండు రోజుల పాటు జరగనున్న మెగా ఫొటో ఎగ్జిబిషన్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఫొటో గ్రాఫర్లు తీసిన ఛాయా చిత్రాలు ప్రదర్సనకు పెట్టారు. వాటి చెంతన రమేష్ క్లిక్ మనిపించిన కోనసీమ అందాల ఛాయా చిత్రాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
ఈ ప్రదర్సనను రాష్త్ర మంత్రి గుడివాడ ఆమర్నాథ్ ప్రారంభించారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, లీడర్ పత్రిక అధిపతి వి.వి.రమణ మూర్తి ఈ కార్యక్రమం లో పాల్గొని ఛాయా చిత్రాలను తిలకించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫొటోగ్రఫి కోసాధికారి డా. రేషెపు గొల్లపూడి పర్యవేక్షణ లో వాల్తేర్ ఫొటో గ్రాఫిక్ సొసైటీ అద్యక్ష కార్యదర్శులు పి.ఎన్.సేతు, ఎం.వి.శ్రీనివాస రెడ్డి వివిధ విభాగాల్లో ఛాయా చిత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేశారు.