70కోట్లు పెట్టి కట్టారు... 20కోట్లతో కూల్చేస్తున్నారు

70కోట్లు పెట్టి కట్టారు... 20కోట్లతో కూల్చేస్తున్నారు

నోయిడా:

నోయిడాలోని ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు

టవర్స్‌ కూల్చేస్తే చుట్టు ప్రక్కల భవనాలపై దుమ్ము పడకుండా పరదాలు

నోయిడా, ఆగస్టు 25: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ రెండు టవర్లను ఆదివారం కూల్చివేయనున్నారు. ఇందుకోసం 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించనున్నారు. రెండు టవర్లలో పేలుడు పదార్థాలను అమర్చడం ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం బాంబులను ఒకదానికొకటి అనుసంధానం చేస్తున్నారు. భవనాలను కూల్చివేసే రోజు వాటిని డిటోనేటర్‌కు కనెక్ట్‌ చేస్తారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలను కూల్చివేతకు ముహూర్తంగా నిర్ణయించారు. భవనాల కూల్చివేత బాధ్యతను ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ సంస్థకు అప్పగించారు.

కూల్చివేత సమయంలో చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. నోయిడాలోని సెక్టార్‌ 93లో సూపర్‌టెక్‌ కంపెనీ 2009లో రూ.70 కోట్లతో ఈ టవర్లను కట్టింది. ఇప్పుడు వాటిని కూల్చివేయడానికి రూ.20కోట్లు ఖర్చు అవుతోంది.