మీసేవా' కార్యకలాపాల్లో.. ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు. అమరావతి (హైకోర్టు)

మీసేవా' కార్యకలాపాల్లో.. ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు.అమరావతి (హైకోర్టు)

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

మీసేవా సెంటర్ల సేవల నిలిపివేతపై నిర్వాహకులు హైకోర్టును అశ్రయించారు.

ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. మీసేవా సెంటర్ల కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

మీ సేవా కేంద్రాలు అందించే సేవలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.

★ రాష్ట్రంలో మీసేవా సేవల నిలిపివేతపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. 

★ ఈ మేరకు మీసేవా సెంటర్ల కార్యకలాపాల్లో జోక్యం వద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 

★ మీ సేవా కేంద్రాలు అందించే సర్వీసులు నిలిపివేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

★ మీ సేవా కేంద్రాల తరఫున న్యాయవాది బేతి వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.

★ ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందన్నారు. 

★ మీసేవా కేంద్రాలకు వచ్చే వారిని గ్రామ సచివాలయాలకు వెళ్లమనడం నిబంధనలకు విరుద్ధమని న్యాయవాది వాదించారు. 

★ ఈ చర్య.. మీసేవా నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలకు వ్యతిరేకమన్నారు. 

★ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. మీసేవా కేంద్రాల కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం వద్దని,సేవలు పునరుద్ధరించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.