బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ద్వారా విశాఖపట్నంలో దివ్యాంగుల సంక్షేమం కోసం విశేష కృషి

బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ద్వారా విశాఖపట్నంలో దివ్యాంగుల సంక్షేమం కోసం విశేష కృషి


విశాఖపట్నం పార్లమెంటులో 50 వేలకు పైగా దివ్యాంగులకు ఉచితంగా లభించనున్న  ఉపకరణాలు  


ఎంపీ జీవీఎల్ చొరవతో కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక సహాయం 

విశాఖ : వి న్యూస్ : నవంబర్ 28: 

విశాఖ ప్రజల ప్రయోజనాల కోసం ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరో కీలక ప్రయత్నం వైకల్యంతో బాధపడుతున్న సుమారు 50,000 మంది దివ్యాంగులకు వరంగా మారనుంది. నవంబర్ 28 నుండి డిసెంబర్ 5 వరకు విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీలలో విడతల వారీగా రోజుకి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో దివ్యాంగుల అవసరాల గుర్తింపు కోసం శిబిరాలు నిర్వహిస్తున్నారు. దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేయడం ద్వారా వారి దైనందిన జీవన శైలి సులభతరం చేసేందుకు ఈ ఉపకరణాలు సహాయపడతాయని, కనుక దివ్యాంగులు అందరూ తమ ప్రాంతాల్లో ఈ శిబిరాలకు చేరుకొమ్మని, వారికి డాక్టర్ల బృందం పరీక్షల తర్వాత వారికి అందజేయవలసిన ఉపకరణాలను నిర్ణయించి వారికి అందజేయడం జరుగుతుందని జీవీఎల్ తెలియజేశారు. బిజెపి ఎంపీ  జీవీఎల్ నరసింహారావు విజ్ఞప్తి మేరకు నరేంద్ర మోడీ  ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా పంపిణీ అందచేసే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టింది. ఎలిమ్కో సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇంత పెద్ద ఎత్తున దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ జరగటం విశాఖపట్నంలో ఇదే మొదటిసారని ప్రధాని నరేంద్ర మోడీ కి ఎంపీ జీవీఎల్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, స్థానిక ఉన్నతాధికారులు కూడా సహాయం చేయడం జరిగిందని, ఈ సందర్భంగా వారందరికీ కూడా ఎంపీ జీవీఎల్ అభినందనలు తెలియజేశారు.