భవ్యశ్రీ కి న్యాయం జరగాలి జనసేన డిమాండ్

భవ్యశ్రీ కి న్యాయం జరగాలి జనసేన డిమాండ్

ఆనందపురం లో కొవ్వొతుల వెలుగుతో నిరసన తెలిపిన భీమిలి జనసైనికులు.

ఆనందపురం: వి న్యూస్ :సెప్టెంబర్ 27: 

చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు అతి దారుణంగా మానభంగం చేసి హత్య చేశారు ఈ సంఘటనపై భవ్యశ్రీ కి న్యాయం జరగాలంటూ భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల ఆదేశాల మేరకు అనందపురం జంక్షన్ రూరల్ పార్టీ కార్యాలయం ఆనందపురం భీమిలి పద్మనాభం మూడు మండలాలు జనసేన నాయకులు పార్టీ కార్యాలయం వద్ద క్యాండిల్ ప్రదర్శన చేసి అనంతరం నాయకులు వీర మహిళలు మాట్లాడుతూ విద్యార్థికి న్యాయం చేయలేని ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని కనీసం విద్యార్థి మృతికి అసెంబ్లీలో కూడా ఏ శాసనసభ్యులు మాట్లాడకపోవడం దుర్మార్గమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఏం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థికి న్యాయం జరగాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శాఖరి శ్రీనుబాబు, చందర్రావు,కృష్ణయ్య, నాగోతి నాయుడు, మజ్జి శ్రీను, పరిమి భువనేశ్వరి, తమ్మిన అప్పలరాజు, తాడివాడ శివకృష్ణ, బొద్దాపు గోవిందు, తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.