బక్కన్నపాలెం రోడ్డులో రేవళ్ల పాలెం లో గల బ్రహ్మకుమారీస్ రాజయోగ మెడిటేషన్ కేంద్రం లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
రేవళ్ల పాలెం:
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బ్రహ్మకుమారీస్,మధురవాడ శాఖ వారు బక్కన్నపాలెం రోడ్డులో రేవళ్ల పాలెంలో గల బ్రహ్మకుమారీస్ రాజయోగ మెడిటేషన్ కేంద్రం లో ఆగస్టు 18 సాయంత్రం కృష్ణాష్టమి యొక్క కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు చైతన్య దేవి దేవతల రూపంలో వేషధారణ ధరించి, రాధాకృష్ణుల రూపంలో నృత్యం చేసి అందరినీ ఆహ్లాద పరిచారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న భక్తులు మరియు బ్రహ్మకుమారి, కుమారులు అందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొని ఆనందం ను అనుభవించారు. అదేవిధంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి యొక్క ఆధ్యాత్మిక రహస్యము ను బ్రహ్మకుమారి అక్కయ్యలు సంధ్య, పార్వతి, పుష్ప మరియు ప్యారి తెలియజేశారు.
రాధాకృష్ణుల సంపూర్ణ పవిత్రతకు గుర్తుగా వారిని ప్రపంచమంతా ఆలయాలు కట్టి, భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారని, పరమాత్మ కూడా ఈ సమయంలో ఆత్మలం దరినీ పవిత్రంగా చేయటానికి వచ్చారని,ఇక్కడ నేర్పించే రాజయోగం ద్వారా ప్రతి ఒక్కరూ తమ మనస్సు మరియు బుద్ధిని పవిత్రంగా చేసుకోగలరని బ్రహ్మ కుమారీలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సంధ్య ,పార్వతీ, పుష్ప ,ఫ్యార్. సురేష్, సుబ్రహ్మణ్యం, నాగేశ్వరరావు ,స్థానిక ప్రజలు మరియు తదిరులు పాల్గొన్నారు.