3 A క్రియేట్ నావెల్ ఎన్సిసి యూనిట్ విశాఖపట్నం వార్షిక శిక్షణ శిబిరం.
విశాఖ లోకల్ న్యూస్ :భీమిలి ప్రతినిధి
3 A క్రియేట్ నావెల్ ఎన్సిసి యూనిట్ విశాఖపట్నం వార్షిక శిక్షణ శిబిరం మే 27 నుండి ఆరో నెల ఐదో తారీకు 22 వరకు విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం గొల్లపాలెం గ్రామంలో ది సిడార్ ఏఎంజి పాఠశాలలో ప్రారంభించారు.
త్రీ ఏ లెవెల్ ఎన్సిసి యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కె ఎస్ బాలాజీ మాట్లాడుతూ ఎన్ సి సి క్యాడేట్ లో దేశానికి ఒక ఆదర్శనీయమైన సేవలందించి శిక్షణ శిబిరంలో సేవలు అందించే వివిధ శిక్షణను నేర్చుకుని భవిష్యత్ తరాల వారికి మార్గదర్శకంగా ఉండాలని సూచించారు.
దీ సిడార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే శ్రీనివాసరావు పాఠశాల ఏ ఎన్ ఓ పి ఈశ్వర్, విశాఖ జిల్లాకు చెందిన 22 విద్యాసంస్థలు ఎం ఎం ఓ లు 397 బాలికలు 214 బాలురు పాల్గొన్నారు
భీమునిపట్నంలో గల స్థానిక అంతర్జాతీయ యోగా శిక్షణా సంస్థ కు చెందిన అప్పలనాయుడు శుక్రవారం ఉదయం 6:30 నుండి 7:30 వరకు యోగా శిక్షణ ఇవ్వడం జరిగింది.
మంగళవారం నుండి సముద్ర తీరం వరకు రూట్ మార్చి చేసుకుంటూ , సాగర తీరంలో ఉన్న వ్యర్ధాలను తొలగించారు మరియు విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శిస్తూ పర్యావరణ ప్లాస్టిక్ నిషేధం కోసం నినాదాలు చేశారు .
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస రావు, వృక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాకర సురేష్ కుమార్ , జీవీఎంసీ సిబ్బంది,
టీమ్ సిబ్బంది మరియు వారి ఎన్ సి సి సిబ్బంది పాల్గొన్నారు.
మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ సిఐ రమణ మరియు ఎస్సై రాంబాబు పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రమణ మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక మాధ్యమాలు వినియోగించుకునే విధానాలు ప్రభావం మరియు పరిణామాలను వివరించారు.
ఎస్సై రాంబాబు విద్యార్థులకు మాదక ద్రవ్యాలు ఏ విధంగా బానిసలుగా తయారు అవుతున్నారు. అని వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
.



