విధ్యుత్ షాక్ :విద్యుత్ పోరాటంలో ఒక్కటవుతున్న విపక్షాలు..పొత్తులకు ఇదే తొలి అడుగు..

 విధ్యుత్ షాక్ :విద్యుత్ పోరాటంలో ఒక్కటవుతున్న విపక్షాలు..పొత్తులకు ఇదే తొలి అడుగు..

ఆంధ్రప్రదేశ్:
కరెంటు షాక్ ఇన్ ఏపీ : ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రప్రదేశ్ ) లో విద్యుత్ ఛార్జీల పెంపు వ్యవహారంపై పొలిటికల్ మంటలు చెలరేగుతున్నాయి. విద్యుత్ ఛార్జీల బాదుడుపై (ఏపీ ఎలక్ట్రిసిటీ చార్జెస్ ) పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
ఉద్యమ బాట పడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా బాదుడే.. బాదుడు అంటూ ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి (సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి ) చేసిన కామెంట్స్ ను వైరల్ చేస్తన్నాయి. వైసీపీ ప్రభుత్వం (వైసీపీ గవర్నమెంట్ ) మూడేళ్లలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు (కరెంటు చార్జెస్ ) పెంచిందని టీడీపీ (టీడీపీ ) ఆరోపిస్తోంది. మరోవైపు దీనిపై దశల వారీ పోరాటినికి సిద్ధమైంది. ఇక జనసేన (జనసేన ) సైతం రంగంలోకి దిగింది. సామాన్యులపై బాదుడుకి నిరసగా ఉద్యమం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (పవన్ కళ్యాణ్ ) నిర్ణయించారు.
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. అందులో భాగంగా.. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఒక్కసారి పవర్ ఇవ్వండి నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ విద్యుత్ ఛార్జీలను పెంచేసి వైసీపీ నాయకత్వం తన పవర్ ఈ విధంగా చూపించుకుంది అంటూ ఎద్దేవా చేశారు..