పేకాట ఆడుతూ పట్టుబడిన బాలయ్య పిఎ: కర్ణాటక లోని గౌరిబిదనూరు లో కేసు.
కర్ణాటక:
ప్రముఖ హీరో హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ పీఏ గా ఉన్న బాలాజీతో పాటు మరి కొందరు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. కర్ణాటకలోని గౌరిబిదనూరు పోలీస్ స్టేషన్లో పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదయింది.
బాలాజీ తో పాటు మరో పన్నెండు మంది ఉపాధ్యాయులు, పోలీసులకు పట్టుబడిన వారిలో ఉన్నట్లు సమాచారం అందింది.
వీరి వద్ద నుంచి
ఒక లక్ష యాభై వేలు నగదును గౌరిబిదనూరు పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
