వాంబేకాలనీలోని శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కార్తీక మాస పూజలు.
మధురవాడ : వి న్యూస్ : నవంబర్ 25:
కార్తీకమాసం ఆఖరి సోమవారం వాంబేకాలనీలోని శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు నాలుగు గంటల నుంచి భారీగాతరలివచ్చారు. దీపాలు వెలిగించి పూజల అనంతరం
ఓం నమఃశివాయ అంటూ ముక్త కంఠం తో శివనామస్మరణ చేశారు.
సోమవారం సాయంత్రం రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు
ఆలయ నిర్వాహకులు తెలిపారు.