ఫీజుల కట్టలేక మోయలేని భారం మోస్తున్న తల్లిదండ్రులు. చదువు ను కొంటున్న పేద విద్యార్థులు.

ఫీజుల కట్టలేక మోయలేని భారం మోస్తున్న తల్లిదండ్రులు.

చదువు ను కొంటున్న పేద విద్యార్థులు. 

:- దుకాణాలు తలపించేలా స్కూళ్లు 

 :-:విద్యా నేర్పించే పాఠాశాల... లేక వ్యాపార  దోపిడీ కేంద్రాల..


:- వేలల్లో  ఫీజులు   వసూళ్లు చేస్తున్న ప్రవేయి ట్ స్కూల్స్


- ఫీజులు కట్టని విద్యార్థులకు గతంలో ఎగ్జామ్స్ నిర్వహించలేదని ఆరోపణలు


- ఎల్ కె జి నుండి వేలల్లో ఫీజులు


- ప్రభుత్వ నిబంధనలకు నీళ్ళు


- నిద్ర వ్యవస్థలో  విద్యాశాఖ యంత్రాంగం


- తనిఖీలు చేసిన దాఖలాలు లేవని ఆరోపిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు


- బెల్టు దగ్గర నుండి షూ వరకు అక్కడే కొనాలని ఒత్తిళ్లు.


వి ఆర్ పురం /వి న్యూస్ : జనవరి 05:

మన్యం లో ప్రవేటు విద్య వ్యవస్థ నిలువు దోపిడి చేస్తుంటే అన్ని చూస్తున్న విద్య శాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎల్ కేజీ నుండి పదోవ తరగతి వరకు వారికి నచ్చిన రెట్లు నిర్ణయిస్తు అక్కడ చదివే విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరనుండి డబ్బులు నిలువు దోపిడీ చేస్తున్నారు. వేలకు వేలు వసూళ్లు చేస్తూ రేకుల సెడ్డుల్లో కనీస సౌకర్యాలు లేకుండా పిల్లల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. సంబంధించిన శాఖా పర్యవేక్షణ  అధికారులు అసలు వున్నరా  తాంబులం  మత్తులో ఊరుకున్నారా...?          ఫీజులు కట్టని విద్యార్థులకు గతంలో ఎగ్జామ్స్ నిర్వహించలేదని ఆరోపణలు ఉన్నాయి.

విద్యార్థులను రెండు గ్రూప్ గా విభజించి ఫీజు పెండింగ్ వున్న వాళ్ళను తక్కువ చేసి        చు   స్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.   సంవత్సరం    మారి తే  ఫీజుపెరిగేలా     వ్యవహరిస్తున్న ప్రవేటు విద్య సంస్థలు. అసలు ప్రభుత్వ నిబంధనలు   ఏమిటి ? . పాటిస్తున్న నిబంధనలు ఏమిటి? పూర్తి వివరాలతో రేపటి కథనం లో