రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే

దక్షిణ మధ్య రైల్వే: వి న్యూస్ : జూన్ 03: 

ఆపరేషనల్ కారణాల వల్ల విజయవాడ డివిజన్‌ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నేటి నుంచి 9వ తేదీ వరకు 12 రైళ్లను రద్దు చేసింది.

దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన

విజయవాడ డివిజన్ మీదుగా వెళ్లే 12 రైళ్లు రద్దు

ఒడిశా ప్రమాదం క్రమంలో మరికొన్ని రైళ్లు క్యాన్సిల్

South Central Railway: పలు కారణాల వల్ల ఏపీలో ప్రయాణించే 12 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏడు రోజుల పాటు రద్దు చేసింది. విజయవాడ-రాజమండ్రి(07459), రాజమండ్రి-విజయవాడ(07460), రాజమండ్రి-విశాఖపట్నం(07466), విశాఖపట్నం- రాజమండ్రి(07467), కాకినాడ పోర్ట్ -విశాఖపట్నం(17267), విశాఖపట్నం- కాకినాడ పోర్ట్(17268), కాకినాడ పోర్ట్ -విజయవాడ(17258), విజయవాడ -కాకినాడ పోర్ట్(17257), గుంటూరు -విశాఖపట్నం(17239), విశాఖపట్నం -గుంటూరు(17240), విశాఖపట్నం- విజయవాడ(22701), విజయవాడ- విశాఖపట్నం(22702) ట్రైన్లను 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రద్దు చేశారు.

ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల కుటుంబసభ్యులకు సహాయం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ- 0866 2576924, రాజమండ్రి- 08832420541, సామర్లకొట-7780741268, నెల్లూరు-08612342028, ఒంగోలు-7815909489, గూడురు-08624250795, ఏలూరు-08812232267 నెంబర్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఏపీకి చెందిన పలువురు ప్రయాణికులు కూాడా ఈ ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 70 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు.

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. నేడు దాదాపు 50 రైళ్లను రద్దు చేయగా.. 38 రైళ్లను దారి మళ్లించారు. హోరా-తిరుపతి(20889), హోరా-సికింద్రాబాద్(12703), హోరా-హైదరాబాద్(18045) రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్-షాలిమార్(22850), వాస్కోడగామా-షాలిమార్(18048) రైళ్లను కటక్, అంగోల్ మీదుగా దారి మళ్లించనుండగా.. చెన్నై సెంట్రల్-హౌరా(12840) ట్రైన్‌ను జరోలి మీదుగా, బెంగళూరు-గువాహటి(12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్, జార్సుగుడా, టాటా మీదుగా మళ్లించనున్నారు. హౌరా-పూరీ(12837), హౌరా-బెంగళూరు(12863), హౌరా-చెన్నై మెయిల్(12839), హౌరా-సంబల్‌పూర్(20831), సంత్రగాచి-పూరీ(02837), కన్యాకుమారి-హోరా(1266), చెన్నై సెంట్రల్-హౌరా(12842), బెంగళూరు- రైళ్లను నేడు రద్దు చేశారు.

నేడు గోవా-ముంబై వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది. కానీ ఒడిశా ప్రమాదం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 230 మంది వరకు మరణించగా.. 900 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మూడు రైళ్లు ఢీకొనడంతో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరగ్గా... సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాత్రి కావడంతో సహాయకచర్యలు నెమ్మదిగా జరగ్గా.. ఉదయం నుంచి వేగంగా చేపడుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇవాళ ఉదయం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా కాసేపట్లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.

కోరమాండల్‌ ప్రమాదం : హెల్ప్‌లైన్‌ నెంబర్లు...రద్దైన రైళ్ల వివరాలు ఇవే


మానవ తప్పిదమే వందల మంది ప్రాణాలను బలిగొందా?. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం. ఇటీవల కాలంలో మన దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం. మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత వర్ణనాతీతంగా పెరిగింది. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసింది.


రైల్వేస్టేషన్లు : విజయవాడలో 0866 2576924, రాజమండ్రిలో 0883 2420541, రేణిగుంటలో 9949198414, తిరుపతిలో 7815915571, నెల్లూరులో 0861 2342028, సామర్లకోటలో 7780741268, ఒంగోలులో 7815909489, గూడూరులో 08624250795, ఏలూరులో 08812232267 నంబర్లను అందుబాటులో ఉంచింది. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో 040 27788516 నంబర్‌ను ఏర్పాటు చేసింది. రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకోవడానికి ఈ నంబర్లకు ఫోన్‌ చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.


అలాగే హౌరాలో 033 2638227, ఖరగ్‌పూర్‌లో 8972073925, 9332392339, బాలాసోర్‌లో 8249591559, 7978418322, 858 5039521, షాలిమార్‌లో 9903370746, సంత్రగాచిలో 8109289460, 8340649469 నంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.  


రద్దయిన రైళ్లు ఇవే : ఈ రూట్‌లో నడిచే దాదాపు 43 రైళ్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరో 38 రైళ్లను దారి మళ్లించింది. బెంగళూర్‌ గౌహతి రైలు.. విజయనగరం, టిట్లాగఢ్‌, టాటా మీదుగా దారి మళ్లించారు. అలాగే   సికింద్రాబాద్‌-షాలిమార్‌ని దారి మళ్లించారు. హౌరా-హైదరాబాద్‌(ఈస్ట్‌ కోస్ట్‌), హౌరా-సికింద్రాబాద్‌(ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌), హౌరా-తిరుపతి రైళ్‌లు రద్దు అయ్యాయి.

12837 హౌరా–పూరీ ఎక్స్‌ప్రెస్‌ (02.06.2023),  12863 హౌరా–సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ ఎక్స్‌ప్రెస్‌ (02.06.2023),  12839 హౌరా–చెన్నై మెయిల్‌ (02.06.2023), 12895 షాలిమార్‌–పూరీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (02.06.2023), 20831    షాలిమార్‌–సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌(02.06.2023),  02837 సంత్రాగచ్చి–పూరి (02.06.2023); 22201 సీల్దా–పూరీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ 0(2.06.2023); 12074    భువనేశ్వర్‌–హౌరా జన్‌ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌    (03.06.2023), 12073 హౌరా–భువనేశ్వర్‌ జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ (03.06.2023), 12278 పూరీ–హౌరా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌    (03.06.2023), 12277 హౌరా–పూరీ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ (03.06.2023), 12822    పూరీ–షాలిమార్‌ ధౌలీ ఎక్స్‌ప్రెస్‌ (03.06.2023), 2821 షాలిమార్‌ – పూరి ధౌలీ ఎక్స్‌ప్రెస్‌ (03.06.2023),  12892 పూరి–బంగిరిపోసి (03.06.2023), 12891 బంగిరిపోసి–పూరి ఎక్స్‌ప్రెస్‌ (03.06.2023),  02838 పూరీ–సంత్రగచ్చి స్పెషల్‌ (03.06.2023), 12842  చెన్నై–షాలిమార్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (03.06.2023), 12509    ఎస్‌ఎంవీటీ బెంగళూరు–గౌహతి (02.06.2023)