ఈస్టర్న్ విశాఖ లో రాష్ట్రీయ ఏక్తా దివస్

 ఈస్టర్న్  విశాఖ లో  రాష్ట్రీయ ఏక్తా  దివస్ 


భీమిలి వి న్యూస్  ప్రతినిధి 

స్డానిక బోయపాలెం లోని   ఈస్టర్న్ విశాఖ  పాఠశాలలో  సర్దార్ వల్లభాయి పటేల్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని ఆచరించారు. ఈ సంధర్బంగా  ఈస్టర్న్ విశాఖ విద్యాసంస్దల అధినేత  బిషప్ డా. కె . ఆర్ . సింగ్ గారు మాట్లాడుతూ భారతదేశ పౌరలందురు ఐక్యతతో మరియు సంమగ్రతతో  మేలగాలని  విద్యార్ధిని, విద్యార్ధులకు దిశనిర్దేశం చేశారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీ బి.ఈశ్వరరావు , ప్రధానోపాధ్యాయులు వై . చార్లెస్ కుమార్ మరియు శ్రీమతి వి . ఝాన్సి రాణి  విద్యార్ధిని, విద్యార్ధులచే ఐక్యత ప్రతిజ్ఞ  చేయించారు. విద్యార్ధిని, విద్యార్ధులు పలికిన నినాదాలు మరియు ప్లకార్డులు ఆహుతులను ఎంతగానో ఆకర్షీంచాయి.