అద్భుతం శ్రీ కృష్ణుడు జననం చరిత్ర మహాద్భుతం.

అద్భుతం శ్రీ కృష్ణుడు జననం చరిత్ర మహాద్భుతం.

జననం


లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మింపదలిచాడు.

మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశంకి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకీ దేవి ఏడవ మారు గర్భం ధరించి నప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భ స్రావం అయిందని అనుకొంటారు. కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు, యక్ష, కిన్నర,కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు.

దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకొని, చెరసాల బయట నిద్ర పోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని, యమునా నది వైపు బయలు దేరుతాడు. యమునానది రెండుగా చీలి పోతుంది. నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా శారంగాలతో ఆకాశం లోకి లేచి పోయి తాను యోగ మాయ నని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది. దేవకీవసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లె లోని యశోదాదేవి ఒడిని చేరి, అక్కడే పెరిగాడు.

జీవితం

వివిధ గ్రంథాలలో శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతం ఉంది. వాటిలో భాగవతంలో ఉన్న కథాక్రమం ప్రజలకు సుపరిచితమైనది. ఇందులో నవమ స్కంధములో వసుదేవుని వంశక్రమం ఉంది. తరువాతదశమ స్కంధముఏకాదశ స్కంధములలో కృష్ణుని జీవిత వృత్తాంతము ఉంది. సంభాషణలో శ్రీకృష్ణుని లాక్షాగృహదహనానంతరం కృష పరవేశం అవుతుంది. అక్కడినుండి కురుక్షేత్ర సంగ్రామం చివరి వరకు కృష్ణుని కథ పాండవుల కథకు సమాంతరంగా నడుస్తుంది. మహాభారతం చివరిలో కృష్ణుని నిర్యాణం ఉంది. భాగవతం కథారంభంలోనే కృష్ణుని నిర్యాణం చెప్పబడింది. వీటిలోనుండి సంగ్రహింపబడిన కృష్ణుని కథ క్రింద ఇవ్వబడింది.

ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవ రాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాశపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు.

మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవ రాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. పెళ్లైన తరువాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తునప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. “ కంసా! నీ చెల్లెలి పెళ్లి తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతంఅని చెబుతుంది. కంసుడు ఒక్కసారిగా ఉగృడవుతాడు. “ఓహో, ఆమె ఎనిమిదో బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన ఎనిమిదో బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేనూ చూస్తానుఅని హూంకరిస్తాడు.

అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోతాడు. పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడిని అర్ధిస్తాడు. “దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలనందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్లిని చంపవచ్చు. కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టుఅని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెలిని, బావను గృహనిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు.

మొదటి బిడ్డ పుట్టగానే కాపలావాళ్ళు కంసుడికి వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకీ వసుదేవులుఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది, బిడ్డను ప్రాణాలతో వదిలేయమనిఏడ్చి ప్రాధేయపడతారు. కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని కాళ్ళు పట్టుకుని ఒక రాయికేసి బాదుతాడు. ప్రతీ సారీ ఒక శిశువు జన్మించటం, తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా, ఆయన ఎవరినీ ప్రాణాలతో వదిలేయకపోవటం. అది ఇలా జరుగుతూనే వస్తుంది.

ఎనిమిదో బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలావాళ్లు అందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడి సంకెళ్లు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకుని, ఎదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నదివైపుకు నడుస్తాడు. ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్నా ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది.

వసుదేవుడు నదిని దాటి నంద, యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి, ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలావాళ్లు వెళ్లి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలావాళ్లను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు.

ఇది కేవలం ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను నిన్ను చంప గలిగేవాడేమో. కాని ఇది ఒక ఆడపిల్ల. పాపను వదిలిపెట్టుఅని కంసుడిని దేవకీ వసుదేవులు అర్ధిస్తారు. కానీ కంసుడు కనికరించడు. బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్లినిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడుఅని చెప్పి మాయమవుతుంది. విధంగా గోకులం చేరిన కృష్ణుడు, రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు. శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాం.